చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించిన లేటెస్ట్ సమ్మర్ సూపర్ హిట్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'. ఇంద్రా రామ్ను హీరోగా పరిచయమయ్యారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రానికి నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా 'చౌర్య పాఠం' ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ, సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం నెక్స్ట్ లెవెల్. దాన్ని దాటి గ్రాటిట్యూడ్ మీట్ వరకు వచ్చాం. ఇది చిన్న సినిమా. 150 సెంటర్లో రిలీజ్ చేసాము. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు. టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టింది. ఇది రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మూడో రోజు బుకింగ్స్ ఇంకా బెటర్ గా ఉన్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. మా టీం తో అన్ని థియేటర్స్ కి వెళ్లాను. నాలుగు సార్లు సినిమా చూశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఫోటోగ్రఫీ పెర్ఫార్మెన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్టర్స్ కాకుండా క్యారెక్టర్స్ కనిపిస్తున్నారని ఆడియన్స్ చెబుతున్నారు. కొత్తవాళ్ళైనా సరే చాలా అద్భుతంగా చేశారని చెబుతున్నారు. రివ్యూస్ కూడా చాలా బావున్నాయి. మంచి సినిమా తీశారని ప్రశంసలు వచ్చాయి. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. కొత్త టీం ని ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా సక్సెస్ మీట్ చేద్దాం. మీరంతా రావాలి. మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఆడియన్ కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మళ్లీ కోరుతున్నాను. థియేటర్స్ కి రండి సినిమా చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థాంక్యూ'అన్నారు.
హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ, ఈరోజుల్లో ఆడియన్స్ థియేటర్స్ రావడం కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాకి వచ్చి ప్రోత్సహిస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఓపెనింగ్స్ బెటర్గా ఉన్నాయి. వైజాగ్ విజయవాడ ముఖ్యంగా చిత్తూరులో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. స్పెషల్ గా స్టూడెంట్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రినాధ రావు గారికి, కార్తీక్ గారికి, నిఖిల్ కి అందరికీ ధన్యవాదాలు' అన్నారు