బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 6 డిశెంబరు 2019 (19:31 IST)

‘ఇద్దరి లోకం ఒకటే’కి ఇన్స్పిరేష‌న్ ఏ సినిమానో తెలుసా..?

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో దిల్ రాజు చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. 2019 సంక్రాంతికి ఎఫ్‌2, సమ్మర్‌లో మహర్షి వంటి బ్లాక్‌బస్టర్స్‌ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం. కానీ ఈ ఏడాది మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ రోజున ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. 
 
దర్శకుడు జీఆర్‌.కృష్ణ ఓ టర్కీ సినిమా చూసిన ఆ ఐడియాను నాకు చెప్పాడు. అక్కడ నుండి మన నెటివిటీకి తగిన విధంగా కథను డెవలప్‌ చేశాం. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. చిన్నప్పట్నుంచి హీరో, హీరోయిన్‌ మధ్య ఇంటిమెసీ ఎలా ఉంటుంది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది కథ.

ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్‌ నన్ను వచ్చి కలిసి ‘సార్‌! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడు. అలా సినిమా మొదలైంది. ఖ‌చ్చితంగా డిసెంబర్‌ 25 వచ్చే ‘ఇద్దరి లోకం ఒకటే’ అందరికీ నచ్చుతుంది” అన్నారు. అదీ.. సంగ‌తి..!