శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (21:44 IST)

నన్ను అందుకే టార్గెట్ చేశారు... కంగనా రనౌత్ (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోమారు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. బాలీవుడ్‌లోని సినీ మాఫియా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌, డ్రగ్స్ వ్యవహారాన్ని తాను లేవనెత్తినట్టు గుర్తు చేశారు. అయితే, అదే డ్రగ్ మాఫియా కారణంగా ఆదిత్య ఠాక్రేకు ముప్పు వస్తుందనే తనను శివసేన టార్గెట్ చేసిందని ఆమె ఆరోపించారు. 
 
బీఎంసీ అధికారులు ఇటీవ‌లే నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా నిర్మించారని ఆరోపిస్తూ కంగ‌నా కార్యాల‌యాన్ని కూల్చేసిన విష‌యం తెలిసిందే. అయితే హైకోర్టును ఆశ్ర‌యించ‌గా కూల్చివేత‌పై.. కోర్టు స్టే విధించింది. మ‌రోవైపు ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మ‌హారాష్ట్ర సీఎం కొష్యారిని క‌లిసి కంగనా విజ్ఞప్తి చేసింది. 
 
అంతకుందు... త‌న ఆఫీసు కూల్చివేత నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై విమ‌ర్శ‌లు గుప్పించింది. త‌న మాట‌ల‌తో శివసేన నేతలకు ముచ్చెమటలు పట్టించారు. ఇపుడు ఏకంగా సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కుమారుడు ఆదిత్య‌థాక్రేను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ వ్య‌వ‌హారంతో సీఎం కుమారుడు ఆదిత్యాథాక్రేకు త‌లనొప్పులు వ‌స్తాయ‌ని, అందుకే త‌న‌ను టార్గెట్ చేశార‌ని కంగ‌నా ఆరోపించింది. ఎవ‌రు ఎవ‌రి ప‌ని ప‌డ‌తారో చూడాల‌ని కంగనా చుర‌క‌లంటించింది.