శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (18:20 IST)

చిరంజీవి సర్జా భార్యకు, కుమారుడి కరోనా.. ఆందోళన వద్దని..?

కన్నడ హీరో చిరంజీవి సార్జా 35ఏళ్ల ప్రాయంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘనారాజ్ ఇటీవలే ఓ బాబుకు జన్మనిచ్చింది. కన్నడ నటి మేఘనారాజ్, ఆమె కుమారుడు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. 
 
చిరంజీవి సర్జా అభిమానులు, తన ఫ్యాన్స్ ఎవరూ ఆందోళన చెందవద్దని మేఘనారాజ్ కోరింది. తాను, తన కొడుకుతో పాటు నాన్న సుందర్‌రాజ్‌, అమ్మ ప్రమీలా జోషాయ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా మా కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. తామంతా క్షేమంగా ఉన్నాం. 
 
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాం. జూనియర్ చిరంజీవి సురక్షితంగా ఉన్నాడు. మా కుటుంబమంతా కరోనాపై పోరాడి... జయిస్తామని మేఘనారాజ్‌ ధీమా వ్యక్తం చేసింది. మేఘనారాజ్ తల్లిదండ్రులు సుందర్ రాజ్‌-ప్రమీలా జోషాయ్‌కు కన్నడనాట మంచి పాపులారిటీ ఉంది.