శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:51 IST)

ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ

తెలుగు వెండితెరపైకి మెరుపు తీగలా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్100' అనే మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. అందం, అభినయం ఆమె సొంతం. పైగా, అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 'ఆర్ఎక్స్100' చిత్రంలో ఈ విషయాన్ని ఆమె నిరూపించింది. ఈ చిత్రం తొలి చిత్రమే అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు, బెణుకు లేకుండా అందాలను ఆరబోసి, కుర్రకారును గిలిగింతలు పెట్టింది. 
 
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ - నాగచైత్యలు కలిసి నటించిన 'వెంకీమామ' చిత్రంలో ముదురు హీరో సరసన నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి.