1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (18:53 IST)

మాస్ మహారాజా తల్లిపై కేసు.. ఏమైంది..?

టాలీవుడ్ మాస్ మహారాజా తల్లిపై కేసు నమోదైంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదైంది. ఇదే కేసులో మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కూడా కేసు నమోదైంది.
 
సర్వే నంబర్ 108, 124లో గల పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను రాజ్యలక్ష్మి, సంజయ్ లు ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.