బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్లో ఛాన్సులు...
కన్నడ నటి పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కు చెక్కేసింది. టాలీవుడ్లో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ.. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారి గురించి పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్స్టాగ్రామ్లో తనకు 27 మిలియన్ మంది ఫాలోయర్లు ఉన్నారని, అయితే, వారంతా తన సినిమా చూసేందుకు థియేటర్లకురారని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోయర్లు ఉంటారని, కానీ వారి సినిమాలకు కోట్ల మంది వస్తుంటారని తెలిపింది. కాబట్టి ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళంతా మన కోసం థియేటర్లకు వస్తారని కాదని చెప్పింది.