నిత్యామీనన్ను పక్కనబెట్టేసిన నితిన్.. శ్రుతిహాసన్తో జోడీ..? మిగిలింది తమన్నానే?!
లవర్ బోయ్ నితిన్ అ.. ఆ.. సినిమాకు తర్వాత ఓ సూపర్ క్రేజీ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అ.. ఆ.. తర్వాత నితిన్ విజయ్ కుమార్ కొండతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా హిట్ కావడంతో మరో సినిమాను తెరకెక్కించేందుకు వీరిద్దరూ సన్నద్ధమవుతున్నారు.
మంచి లవ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్గా ముందు నిత్యా మీనన్ను అనుకున్నా ప్రస్తుతం శ్రుతిహాసన్ను తీసుకోవాలని నితిన్ తాపత్రయపడుతున్నాడు. హీరోయిన్ విషయంలో నితిన్ శృతి మీద నితిన్తో పాటు దర్శకనిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరితో నటించిన నితిన్, అ..ఆ..తో సమంతతో కూడా రొమాన్స్ చేయడం జరిగింది. ఇక శృతి హాసన్ కూడా నితిన్తో జతకడితే ఇక తమన్నా ఒక్కతే నితిన్కు జోడీ కట్టని హీరోయిన్గా ఉంటుంది. సో సినిమా కథల విషయాల కన్నా సినిమాకు కలర్ఫుల్ తెచ్చే హీరోయిన్ విషయంలో నితిన్ చొరవ చూపించడం విశేషం.
ఇక శృతి హాసన్ కూడా శ్రీమంతుడు తర్వాత ఏది కమిట్ అవ్వలేదు. నాగ చైతన్యతో ప్రేమమ్ సినిమాలో మాత్రం నటిస్తోంది. మరి నితిన్ ఆఫర్ను అమ్మడు ఓకే చేస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.