మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:46 IST)

ట్రెండింగ్‌లో అదరగొడుతున్న ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ప్రోమో.. (వీడియో)

వరుణ్ తేజ్ హీరోగా హరీష శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "వాల్మీకి". రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 20వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన "జిగర్తాండ" మూవీకి తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. 
 
ఈ చిత్రంలో మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు చాలాకొత్తగా వున్నాయి. అయితే వాల్మీకి సినిమాలో అలనాటి తారలు శోభన్ బాబు, శ్రీదేవిలు నటించిన దేవత సినిమాలోని సూపర్ హిట్ పాట "ఎల్లువచ్చి గోదారమ్మ"ని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోని దర్శకేంద్రుడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. 
 
ఈ పాటను విడుదల చేసిన సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. దేవత సినిమాలో ఆ పాటని షూట్ చేయాలనుకున్నప్పుడు చాలా గమ్మత్తు జరిగిందన్నారు. ఈ పాటని షూట్ చేయడానికి రాజమండ్రి దగ్గర్లోని ఉండ్రాజవరం అనే ఊరికి వెళ్లాం. అక్కడ ఒక డాబా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు పక్కన టప్ టప్ అని చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అవేంటని అడిగితే ఈ ఊళ్ళో వాళ్ళు బిందెలు తయారు చేస్తారు. ఆ చప్పుడు వాటిదే అన్నారు.
 
వెంటనే బిందెల తో షూట్ చేయాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. ఈ పాట ఇంత బాగా రావడనికి కారణమైన రామానాయుడు గారికి, వేటూరి సుందర రామ్మూర్తి గారి దన్యవాదాలు తెలియజేశారు. ఇక ఆ సాంగ్‌ని అదే పద్దతిలో హరీష్ శంకర్ తీయడం బాగుందని, తనకి నచ్చిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే.. ఈ సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. 
 
 
సెప్టెంబర్ 20న విడుదలౌతున్న వాల్మీకిలో వరుణ్ 'గద్దలకొండ గణేష్'గా వస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తో పాటు పూజా హెగ్డే, తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే. మేయర్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట.. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.