శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (21:00 IST)

కొడుకా, క్రూరుడా? తల్లి చెంపపై ఒకే ఒక్క దెబ్బ, ప్రాణాలొదిలేసింది

కన్న తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాగే వారు వృద్ధులయ్యాక తమ కంటికి రెప్పలా పిల్లలు చూసుకోవాలి. ఐతే ఓ కన్నకొడుకు కంటికి రెప్పలా చూసుకోవడం కాదు... చెంపపై ఒకే ఒక్క దెబ్బతో ఆమెను కాటికి పంపించాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో 76 ఏళ్ల అవతార్ కౌర్ తన కుమారుడు రణవీర్, కోడలితో వుంటోంది. మార్చి 15న పక్కింటి వారితో పార్కింగ్ విషయమై వృద్ధురాలు గొడవపడింది. దీనితో కొడుకూ కోడలు ఇద్దరూ ఆమె వద్దకు వచ్చారు.
 
ఆమె చెప్పినవన్నీ విన్న కొడుకు పక్కింటివారితో పోట్లాడి తన పరువు తీశావంటూ తీవ్ర ఆగ్రహంతో ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అక్కడి సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.