గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2020 (17:42 IST)

రాఖీ పండగను సంతోషంగా జరుపుకున్న రోజా, కానీ అప్పటి ఘటన గుర్తు చేసుకుని?

ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యుల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. తన ఇద్దరు అన్నలకు రాఖీ కట్టారు రోజా. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపారు. అన్నా... ఆశీర్వదించండి అంటూ కాళ్ళపై పడి దణ్ణం పెట్టారు. 
 
అన్నలు రోజాను ఆశీర్వదించారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు రోజా. ఎంతో సంతోషంగా కనిపించారు. మహిళా సాధికారికత సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా చెప్పారు. స్వామివారిని దర్సించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
 
రక్షాబంధన్ రోజు ఇ-దర్సన్ పేరుతో మహిళా భద్రత కోసం సిఎం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రోజా. గత సంవత్సరం వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టానని... రక్తం పంచుకుని పుట్టకపోయినా జగన్ తన కుటుంబంలో ఒక సభ్యుడని.. ఎప్పుడూ ఆయన్ను తన అన్నగానే భావిస్తానని రోజా చెప్పారు. స్వయంగా కుటుంబ సభ్యులందరికీ వంటలు చేసి అందరూ కలిసి ఇంటిల్లిపాది భోజనం చేశారు.