శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (16:19 IST)

డియర్ బెనర్జీ... దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి

పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపినందుకుగాను ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన ఇండో-అమెరికా శాస్త్రవేత్త అభిజిత్ బెనర్జీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. అభిజిత్‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. ముఖ్యంగా, అభిజిత్‌ ఫ్రొఫెషనలిజంపై గోయల్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని రాహల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 'డియర్‌ బెనర్జీ.. ఈ దురభిమానులకు ద్వేషంతో కళ్లుమూసుకుపోయాయి. వారికి ఫ్రొఫెషనల్‌ అంటే ఏంటో తెలీదు. మీరు దాని గురించి వారికి వివరించలేరు. దశాబ్దాల పాటు ప్రయత్నించినా అది వృథా ప్రయాసే అవుతుంది. మీ కృషి పట్ల లక్షలాది మంది భారతీయులు గర్విస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి' అంటూ అందులో పేర్కొన్నారు.
 
అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన ప్రతిపాదించిన 'న్యాయ్‌' పథకం ఎన్నికల్లో తిరస్కరణకు గురైందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను అభిజిత్‌తో పాటు.. రాహుల్ గాంధీ కూడా తోసిపుచ్చారు.