గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (08:10 IST)

పోలీస్ చిరుతపులి : రియల్ హీరో సుందర్‌కు ప్రశంసల వెల్లువ.. ఎందుకు?

ఆయనో రైల్వో పోలీస్. కానీ, ఆయన చేసిన పనికి ఇపుడు దేశం మొత్తం అభినందనల్లో ముంచెత్తుతోంది. పైగా, ఆయన ఓ పోలీస్ కాదనీ, చిరుతపులతో పోల్చుతున్నారు. ఓ పసిబిడ్డ ఆకలి తీర్చేందుకు ఓ తల్లి ప్రయత్నానికి తన వంతు సహకారం అందించాడు. ఈ వ్యవహారం మొత్త సీసీటీవీ కెమెరాల్లో నమోదై, చివరకు రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ పోలీస్ చిరుతకు నగదు బహుమతిని ప్రకటించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌కు వెళుతున్న ఓ రైలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ స్టేషన్‌లో ఆగింది. ఆ రైలులో నాలుగు నెలల చిన్నారితో పాటు ఓ మహిళ ప్రయాణిస్తోంది. తన వద్ద ఉన్న పాలు అయిపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌ను సాయం కోరింది. 
 
అయితే ఇందర్ యాదవ్ పాల ప్యాకెట్ తెచ్చేలోపే రైలు కదిలింది. అయితే, ఆ చిన్నారి ఆకలి, తల్లి వేదన గుర్తు తెచ్చుకున్న ఇందర్ యాదవ్ రైలు వెంబడి చిరుతలా పరుగెత్తాడు. భుజానికి బరువైన రైఫిల్ వేళ్లాడుతున్నా వెనుదీయకుండా, తన శక్తిమేర ఓ మహిళ ఉన్న బోగీ వెంట పరుగులు తీశాడు. చివరికి పాలను ఆ తల్లికి అందించి తన పరుగును ఆపాడు. 
 
ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. ఈ ఘటన రైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి వెళ్లడంతో, రైల్వే పోలీసు ఇందర్ యాదవ్ ను అభినందించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
 
ఇదిలావుంటే, తన ఇంటికి చేరుకున్న ఆ మహిళ రైల్వే పోలీసు ఇందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఒక హీరోలాగా తన బిడ్డ ఆకలి తీర్చాడని, పాలు లేకపోవడంతో బిడ్డకు నీళ్లలో ముంచిన బిస్కెట్లు తినిపించాల్సిన అగత్యం నుంచి తప్పించారని కొనియాడింది.