శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:48 IST)

వరదలు.. 12 ఏళ్ల కుర్రోడు.. ఆంబులెన్స్‌కు అలా దారి చూపాడు..

వరద ఉధృతి, అంబులెన్స్ వచ్చేస్తోంది. కానీ వయస్సులో చిన్నవాడైనా ధైర్యంతో ముందుకెళ్లాడు. అంతేగాకుండా వరదలతో మునిగిపోయిన బ్రిడ్జిపై ధైర్యంగా ముందుకు దాటుతూ అంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఇదంతా చేసింది.. 12 ఏళ్ల బాలుడు మాత్రమే. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్ చూర్ జిల్లాలోని దేవదుర్గ తాలుకాలో హిరేరాయంకుంపీ గ్రామంలో ఓ బ్రిడ్జి వరద నీటితో మునిగిపోయింది. రోడ్డంతా మునిగిపోవడంతో బ్రిడ్జి దాటేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. 
 
బ్రిడ్జీ ఎక్కడ వరకు ఉందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడే ఓ ఆంబులెన్స్ అదే బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ వరద నీరు కారణంగా బ్రిడ్జి దాటేందుకు ఆంబులెన్స్ ముందుకెళ్లలేదు. మధ్యలో వరదనీరు పొటెత్తడంతో అక్కడే నిలిచిపోయింది. 
 
ఇంతలో 12ఏళ్ల వెంకటేశ్ అనే బుడ్డోడు అక్కడికి చేరుకున్నాడు. వెంటనే తానున్నాను పదా అంటూ ధైర్యంగా ముందుకు సాగాడు. నీటిలో పడుతూ లేస్తూ ముందుకు నడుస్తూ ఆంబులెన్స్‌కు మార్గం చూపించాడు. ఆ బుడ్డోడిని అనుసరిస్తూ అంబులెన్స్ ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా వెంకటేశ్ చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.