ముడతల చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

మంగళవారం, 22 జనవరి 2019 (13:00 IST)
నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణంగా కొంతమందికి కళ్ల చివర్లు, పెదవుల చుట్టూ ముడతలు వస్తుంటాయి. చర్మంపై సన్నటి గీతల్లా కనిపించే ఈ ముడతలను మాయం చేసే సులువైన ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
ముందుగా.. తేనెకు గుడ్డు తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లటి పాలలో ముంచిన దూదితో తొలగించి, చల్లటి నీటితో కడుక్కుని నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేసినట్లయితే ముఖంపై ముడతలు మటుమాయమవుతాయి.
 
అలాగే... శెనగపిండి, వరిపిండి చెరో చెంచా చొప్పున తీసుకుని దానికి కొద్దిగా పాలు, ఆలివ్ లేదా ఏదైనా వంటనూనె నాలుగైదు చుక్కలు కలిపి బాగా మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మం కొత్త నిగారింపును సంతరించుకునే ఈ స్క్రబ్ పొడి చర్మం కలిగినవారికి ఎంతగానో మేలు చేస్తుంది.

అన్నీ చూడండి

విక్రమ్-1 విజయవంతం.. లాంచ్ వ్యూ గ్యాలరీలో మంత్రి లోకేశ్‌, దేవాన్ష్.. మోదీ కితాబు

APSRTC: ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. 60 ప్రయాణికులకు ఏమైంది?

గుంటూరులో నీటి వివాదం: మహిళపై దాడి, వివస్త్రను చేసి వేధింపులు

గోదావరి డెల్టా 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాత లోటు

డిజిటల్ ఆధారాలతో అలా పట్టుకున్నారు... భర్తను ప్రియుడితో కలిపి చంపేసింది..

అన్నీ చూడండి

Priyanka Chopra: వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ పోస్ట్ చేసిన రాజమౌళి

Sumanth: వారాహి అమ్మవారి చుట్టూ సాగే కథతో మహేంద్రగిరి వారాహి సిద్ధం

Ameer Log: అమీర్ లోగ్ నుంచి స్ట్రీట్ ఆంథమ్‌లా సాగే సీదా హెలికాప్టర్ షాట్ పాట

దురంధర్, ది రాజా సాబ్ సినిమాలతో ఓటీటీలో పోటీలో నెగ్గిన శ్రీ నందు అగ్లీ స్టోరీ

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments