శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (18:59 IST)

మూడంటే మూడే.. వాటితో ఎంత మేలో తెలుసా? రిసిపీ ఇదిగోండి..(video)

పలు వ్యాధులను నివారించే ఓ దివ్యౌషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడంటే మూడే వస్తువులే. అవేంటంటే..? 
 
మెంతులు-పావు కేజీ 
ఓమమ్- వంద గ్రాములు 
నలుపు జీలకర్ర - 50 గ్రాములు 
 
ఈ మూడింటిని శుభ్రం చేసుకుని వేర్వేరుగా మాడనివ్వకుండా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని రాత్రి నిద్రించే ముందు ఒక స్పూన్ మోతాదులో రోజు తీసుకుంటూ వుండాలి. దీన్ని తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోకూడదు. రోజూ దీన్ని తీసుకుంటే.. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోతాయి. 
 
# కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 
# రక్తం శుద్ధి అవుతుంది. 
# హృద్రోగ వ్యాధులుండవు. 
# చర్మంలోని ముడతలు తొలగిపోతాయి. 
# శరీరం దృఢంగా వుంటుంది. 
# రక్తనాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. 
 
# శరీరం తేజోవంతమవుతుంది. 
# శరీరానికి చురుకుదనం చేకూరుతుంది. 
# ఎముకలు పటిష్టమవుతాయి. 
# ఎముకలకు సంబంధించిన రోగాలుండవు 
# చిగుళ్ల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 
# కంటి దృష్టి లోపాలుండవు 
 
# కేశాలు సంరక్షణకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
# ఆలోచనా తీరు మెరుగ్గా వుంటుంది. 
# మహిళల్లో రుతుక్రమ రోగాలు తొలగిపోతాయి. 
# లైంగిక సంబంధిత సమస్యలూ తొలగిపోతాయి. 
# మధుమేహాన్ని నియంత్రిస్తుంది. 
 
ఈ నలుపు జీలకర్ర, ఓమమ్, మెంతులు కలిపిన పొడిని క్రమంగా మూడు నెలల పాటు వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.