ముడతల చర్మానికి బ్యూటీ చిట్కాలు...

బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెుటిమలు, మచ్చల్ని తొలగించుటలో చాలా సహాయపడుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసుకుని అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి.

సోమవారం, 23 జులై 2018 (17:29 IST)
బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మెుటిమలు, మచ్చల్ని తొలగించుటలో చాలా సహాయపడుతుంది. బొప్పాయి పండును గుజ్జుగా చేసుకుని అందులో తేనె, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే మచ్చల్లేని చర్మం మీ సొంతమవుతుంది.
 
ఎక్కువగా బయట తిరగడం వలన చర్మంపై మురికి చేరుతుంది. అలాకాకుండా ఉండాలంటే టమోట గుజ్జులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మం తాజాగా మారుతుంది. ముడతలు చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా బియ్యప్పిండిని కలుపుకోవాలి.
 
ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు చర్మం తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది. రెండు స్పూన్స్ తేనెలో కొద్దిగా కోడిగుడ్డు సొనను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
బంగాళాదుంప గుజ్జులో రెండు చెంచాల ఓట్స్, రెండు చెంచాల పాలు, తేనె, ఆలివ్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ముఖం మృదువుగా, అందంగా మారుతుంది.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments