Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్

Written By సెల్వి
Updated: శనివారం, 23 అక్టోబరు 2021 (12:11 IST)
కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,455గా ఉంది
 
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. హైదారబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,490గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,860 దొరుకుతోంది. 
 
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,840, ముంబైలో 46,470, న్యూఢిల్లీలో 46,700, కోల్‌కతాలో 46,900, బెంగళూరులో 44,550, కేరళలో 44,500గా ఉన్నాయి.

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments