Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ ద్రవ్య పాలసీ కీలక నిర్ణయాలు - పెరగనున్న వడ్డీ రేట్లు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 8 జూన్ 2022 (13:32 IST)
భారత రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాల్లో రెపో రేటును 0.05 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. అదేవిధంగా వృద్ధిరేటును 7.2 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణం అంచనాలు 6.7 శాతానికి పెంచాయి. సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగానే కొనసాగించినప్పటికీ ద్రవ్యోల్బణం అంచాలను మాత్రం పెంచింది. గతంలో 5.7 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఇపుడు దీన్ని 6.7 శాతానికి పెంచేసింది. 
 
అదేసమయంలో వృద్ధికి మద్దతుగా సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ చ్చింది. ఇటీవలే ఈ సర్దుబాటు విధానాన్ని రద్దు చేసింది. ఇపుడు దీన్నే కొనసాగిస్తున్నట్టు తెలిపింది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.15 శాతానికి, బ్యాంకు రేటును  4.65 శాతానికి పెంచింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష ఆగస్టు 2 - 4వ తేదీల మధ్య ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments