మరోమారు ఎగిసిపడిన బంగారం ధరలు

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:41 IST)
దేశంలో పసిడి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు బాగా ఇష్టపడతారు. దీంతో డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మరోమారు బంగారం ధరలు పెరిగాయి. 
 
శుక్రవారం బులియన్ మార్కెట్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి, రూ.45,350కు చేరింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.49,480కి చేరింది. 
 
ఇక వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.66,200కు చేరుకుంది. ఇపుడు దేశంలో పండగల సజీన్ మొదలు కావడతో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. 

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments