Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ ఎఫెక్టు... ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 2 మార్చి 2022 (22:17 IST)
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుంది. ఇదివరకే ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఎన్.ఐ.టి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 
 
మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 23వ తేదీ నుంచి నిర్వహిస్తారు. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు రోజులు ఆలస్యంగా ఈ పరీక్షలు జరుగుతాయి. 
 
నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫలితాల్లో మార్పులు చేసింది. 

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments