గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (09:10 IST)

రాజస్థాన్‌లో నీట్ కౌన్సిలింగ్- 705 మెడికల్ సీట్లున్నా లోయర్ ర్యాంక్‌ వారికే?

నీట్ కౌన్సిలింగ్ 2019 ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడత నీట్ కౌన్సిలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 705 మెడికల్ సీట్లు ఖాళీగా వున్నాయని అధికారులు తెలిపారు.
 
కానీ నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. కౌన్సెలింగ్ అథారిటీ నిర్లక్ష్యం కారణంగా లోయర్ ర్యాంకులు కలిగిన విద్యార్థులకు ఉన్నత ర్యాంకు ఉన్నవారి కంటే మెరుగైన సీట్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. 
 
రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటం ఇదే మొదటిసారి. ఖాళీగా ఉన్న ఎంబిబిఎస్ సీట్లలో ప్రభుత్వ సీట్లు, మేనేజ్‌మెంట్ సెట్లు, ఎన్నారై అభ్యర్థులకు కేటాయించిన సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, 885 బిడిఎస్ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి.
 
రాష్ట్రం వెలుపల ప్రవేశం పొందిన మొదటి రౌండ్లో విద్యార్థులకు కేటాయించిన సీట్లు మొదటి రౌండ్ తరువాత బ్లాక్ చేయబడిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు. సీట్ల మ్యాపింగ్ పూర్తి చేయడానికి కౌన్సెలింగ్ యాజమాన్యం రెండో విడత కౌన్సిలింగ్‌లో జాప్యం చేసినప్పటికీ, సీట్లకు విముక్తి కలగలేదు. ఇంకా మాప్-అప్ రౌండ్‌ రద్దు చేయాలని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అవకతవకలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడానికి పలువురు విద్యార్థులు ట్విట్టర్‌ను ఎంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను విద్యార్థులు తెలియజేస్తున్నారు.