Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింత ఆలస్యంకానున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 7 ఆగస్టు 2022 (12:28 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యంకానున్నాయి. నిజానికి ఫలితాలను ఈ వారమే విడుదల చేయాల్సివుంది. కానీ, అనివార్య కారణాలతో ఈ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. 
 
ఎంసెట్ విభాగంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. గత నెల 30, 31 తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,56,812 మంది హాజరయ్యారు. 
 
ఇకపోతే, ఈ ఫలితాల విడుదల జాప్యంపై తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. కాబట్టి ఇది ఇక్టోబరు చివరివారం వరకు జరుగుతుందని చెప్పారు. నవంబరు ఒకటో తేదీ నుంచి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. 

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments