1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. AP ICET Results 2022 to release August 8th

ఈ నెల 8న ఏపీలో ఐసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన ఐసెట్ పరీక్షా ఫలితాలను వెల్లడికానున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధించి ఏపీ ఐసెట్-2022 పరీక్షా ఫలితాలను ఈ నెల 8వ తేదీన వెల్లడికానున్నాయి.
 
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25వ తేదీన పలు పరీక్షా కేంద్రాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ షీట్ విడుదలైంది.
 
ఇక ఆగస్టు 8న ఏపీఐసెట్ ఫలితాలను వెల్లడించాల్సివుంది. ఈ ఐసెట్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు - దేశంలో 7కి చేరిన కేసులు