దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇవే...

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:00 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,948 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. ఒక్క‌ కేర‌ళ‌లోనే 26,701 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 74  మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,27,621కి చేరింది. 
 
అలాగే, ఆదివారం 43,903 మంది కోలుకున్నారన్నారు. దేశంలో క‌రోనాతో మ‌రో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,752కి పెరిగింది. 
 
ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,81,995 మంది కోలుకున్నారు. 4,04,874 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 68,75,41,762 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. 

అన్నీ చూడండి

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Anasuya Bharadwaj: నాగబంధం నుంచి లీలావతిగా అనసూయ భరద్వాజ్ లుక్

Ram Pothineni: 38వ పుట్టినరోజున దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న రామ్ పోతినేని

తర్వాతి కథనం
Show comments