Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో బోర్డు పెట్టేశారు, ఈ 6 గుండుమాత్రలతో కరోనా పరార్, నిజమా?

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 3 మార్చి 2020 (19:29 IST)
కరోనా వైరస్
కరోనా వైరెస్ వ్యాధికి మందు ఇప్పటి వరకూ కనుగొనలేదు. వేలల్లో జనం ప్రాణాలు పోయిన చైనా కరోనాను అడ్డుకునేందుకు ఔషధాన్ని కనుగొనేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలావుండగానే ప్రపంచంలో 66 దేశాలకు కరోనా వైరెస్ వ్యాపించింది. ఈ దేశాల్లో ఇండియా కూడా చేరిపోయింది. తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకటి తెలంగాణ రాజధాని హైదరాబాదులో అయితే మరొకటి ఢిల్లీలో.
వ్యాధి నిర్థారణ అయిన రోగులను ఐసోలేటెడ్ గదుల్లో వుంచి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వ్యాధిని ఎలా అడ్డుకోవాలో చెపుతూ టీవీల ద్వారా, హోర్డింగుల ద్వారా ప్రజలకు తెలియజేస్తోంది. ఐతే తాజాగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ పోస్టు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 
ఆ ప్రకనట సారాంశాం ఏంటంటే... కరోనా వైరెస్‌ను ఆయుర్వేదం అడ్డుకుంటుందట. ఎలాగంటే, మూడు రోజుల పాటు ప్రతిరోజూ 6 గుండుమాత్రలు వేసుకోవాలి. ఇది పెద్దవాళ్లకు. 0-1, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లిపాలతో కలిపి 3 మాత్రలివ్వాలి. ఏడాది పైన వున్న పిల్లలకి 6 మాత్రలు వేయాలి. అది కూడా అన్నం తినే అర్థగంట ముందు. ఇదంతా చూసిన జనం, ఇది నిజమేనా అని చర్చించుకుంటున్నారు.

అన్నీ చూడండి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

Dhanush: పాఠశాలకు మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చిన ధనుష్

Vishal :విశాల్ చిత్రం మకుటం ట్రైలర్, విడుదల తేదీ ఖరారు

Sundeep Kishan: చందమామ మ్యాగజైన్ తరహా లో ఆకట్టుకున్న కరికాల నుంచి సందీప్ కిషన్ లుక్

మిస్సింగ్ మేఘన మూవీ కి మంచి పేరు రావాలి : వి. వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments