Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 68 వేలమందికి కోవిడ్ పరీక్షలు - 1433 మందికి పాజిటివ్

Written By ఠాగూర్
Updated: బుధవారం, 18 ఆగస్టు 2021 (19:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 68,041 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇందులో 1,433 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 216 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 16 కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడగా... 1,815 మంది కోలుకున్నారు. ఈ లెక్కలతో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 19,97,102కి చేరుకుంది. మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. 13,686 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
మరోవైపు, కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ ‌కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. 
 
కాగా, మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,427 కరోనా కేసులు, 179 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,45,457కు, మొత్తం మరణాల సంఖ్య 19,049కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 18,731 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 35,48,196కు చేరుకున్నదని పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో టెస్ట్‌ పాజిటివిటీ రేటు 15.5 శాతంగా ఉన్నది. 

అన్నీ చూడండి

Ravi Teja: ఇరుముడి రెస్పాన్స్ చూస్తుంటే కళ్లు చెమర్చాయి.: మహారాజా రవితేజ

Rajamouli: వారణాసి లో డబ్బింగ్ కళాకారుల కోసం కసరత్తు చేసిన రాజమౌళి

ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమాను ప్రకటించిన కిరణ్ అబ్బవరం

Tamannaah : తమన్నా భాటియా... ది వ్వాన్ ఎపిక్ ఫాంటసీ విడుదలకు సిద్ధం

Soundarya Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆత్మ కథను రాయనున్న సౌందర్య

తర్వాతి కథనం
Show comments