కరోనా వైరస్‌ని మంత్రాలతో పారద్రోలవచ్చా..?

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (18:54 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19‌ను మంత్రాలతో పారద్రోలుతానంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... సిరిసిల్ల పట్టణానికి చెందిన కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 
 
నిందితుడు జిల్లా ప్రజలనే కాకుండా వేరే జిల్లాల నుంచి వచ్చే వారిని కూడా మంత్రాలు, తాయత్తులతో కరోనాను నయం చేస్తానని చెప్పి ధనార్జనకు పాల్పడుతున్నాడని సీఐ రవికుమార్ తెలిపారు. అతని దగ్గరి నుంచి ఉంగరాలు, రంగు రాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని చెప్పారు.

అన్నీ చూడండి

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments