Webdunia - Bharat's app for daily news and videos

Install App

113 దేశాలకు వ్యాపించిన కరోనా.. మృతులు 4009 పైమాటే...

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 10 మార్చి 2020 (14:49 IST)
ప్రపంచ వ్యాప్తంగా 113 దేశాలకు కరోనా వైరస్‌ పాకింది. కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4009కి చేరింది. ఇప్పటివరకు 1,14,285 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇటలీలో సోమవారం ఒక్కరోజే 97 మంది మృతి చెందగా, 1797 కేసుల నమోదయ్యాయి. చైనాలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. 
 
ప్రాణాలు తీసిన వదంతులు 
ఇరాన్‌లో వదంతులు ప్రాణాలు తీశాయి. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో ఇరాన్‌ అతలాకుతలమైపోతుంది. 
 
మంగళవారం ఒక్కరోజే కరోనా వైరస్‌తో 43 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మంగళవారం ఒక్కరోజే 595 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇరాన్‌లో 237 మంది మృతి చెందారు. మరో ఏడు వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. 
కరోనా ప్రభావం ఖైదీలపై ఉండటంతో 70 వేల మంది ఖైదీలను ఇరాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. 

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments