కేరళలో దడపుట్టిస్తున్న కరోనా వైరస్

గురువారం, 23 సెప్టెంబరు 2021 (10:06 IST)
దేశంలో కరోనా కేసులు మళ్లీ 30వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 15,27,443 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,923 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర పెరిగాయి. 
 
వీటిలో ఒక్క కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో 3 వేల మందికి వైరస్ సోకింది. నిన్న మరో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య గణాంకాలను వెల్లడించింది.
 
దేశంలో ఇప్పటివరకు 3.35 కోట్ల మందికి కరోనా సోకగా... 3.28 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న 31 వేలమంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,01,640 మంది వైరస్‌ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఇక 4,46,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియాశీల కేసులు రేటు 0.90 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది.
 
83 కోట్ల టీకా డోసులు పంపిణీ.. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగా ఉంది. నిన్న 71.38 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 83.39 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

అన్నీ చూడండి

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments