ఢిల్లీలో మొదలైన కమ్యూనిటీ స్ప్రెడ్ : ఆరోగ్య శాఖామంత్రి జైన్

గురువారం, 30 డిశెంబరు 2021 (16:30 IST)
దేశ రాజధాని ఢిల్లీ మరోమారు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ కూడా క్రమంగా జనాల్లోకి వెళ్లిపోయి వ్యాప్తి మొదలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో కొత్తగా నమోదైన 46 శాతం కేసుల్లో ఒమిక్రాన్ కేసులేనని ఆయన గుర్తుచేశారు. అందుకే ఢిల్లీలో జన్యుక్రమ విశ్లేషణ మొదలుపెట్టినట్టు చెప్పారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 923 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మే 30వ తేదీ నుంచి నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 

అన్నీ చూడండి

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments