అలా చేస్తే థర్డ్‌వేవ్‌కు ఆస్కారముండదు: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

గురువారం, 1 జులై 2021 (18:39 IST)
దిల్లీ: ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తే థర్డ్‌వేవ్‌కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. థర్డ్‌వేవ్‌ అనేది అది ప్రజల వ్యవహరించే తీరు, వ్యాక్సిన్‌ వేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేళ వచ్చినా మూడో దశ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, దానిపై ముందుకెళ్లేందుకు మరింత డేటా అవసరం ఉందని చెప్పారు.
 
దేశంలో ప్రస్తుతం రోజువారీ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. యాక్టివ్‌ కేసులు సైతం తగ్గాయని చెప్పారు. అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పాజిటివిటీ రేటు అధికంగా ఉందన్నారు. అలాంటి ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రదేశాలు హాట్‌స్పాట్లుగా మారి మరో ప్రాంతానికి విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అన్నీ చూడండి

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

పొరపాటున కూడా నా కలలోకి రావొద్దంటున్న 'డ్రాగన్'

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

తర్వాతి కథనం
Show comments