Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా కరోనా అప్డేట్: 40వేలు దాటిన కరోనా కేసులు

Written By ఎం
Updated: శనివారం, 20 మార్చి 2021 (17:38 IST)
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. రోజువారి పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  తాజాగా ఇవాళ కేంద్రం కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది.  
 
ఇందులో 1,11,07,332 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,88,394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 188 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,558కి చేరింది.
 
గడిచిన 24 గంటల్లో ఇండియాలో 23,653 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం ఇప్పటివరకు 4,20,63,392 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్టు కేంద్రం తన బులెటిన్ లో పేర్కొన్నది.

అన్నీ చూడండి

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తి- శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులు - సెప్టెంబర్ 24న రిలీజ్

తర్వాతి కథనం
Show comments