Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్కసారిగా 20 వేలు దాటికి కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 20 జులై 2022 (10:58 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20557 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,38,03,619కు చేరాయి. ఇందులో 4,31,13,623 మంది కోలుకోగా మరో 5,25,785 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,45,654 కరోనా యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. 
 
మరోవైపు గడిచిన 24 గంటల్లో 18517 మంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది. 
 
ఇంకోపైవు, దేశవ్యాప్తంగా ఇప్పటివరు 200.61 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా, రికవరీ శాతం 98.47 శాతంగా ఉంది. మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. 

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments