గణనీయంగా తగ్గిన కోవిడ్ యాక్టివ్ కేసులు...

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:05 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పా
జిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.21 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 5,379 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ముందురోజు కంటే వెయ్యి కేసులు అదనంగా వచ్చాయి. పాజిటివిటీ రేటు 1.67 శాతానికి చేరింది.
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 7,094 మంది కోలుకున్నారు. కేరళలో 11 మరణాలు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 27 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 50 వేలకు తగ్గాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50,594(0.11 శాతం)కి చేరింది. 
 
ఈ రెండేళ్ల కాలంలో 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.70 శాతం మంది వైరస్‌ను జయించారు. ఇక ఇప్పటివరకూ 213 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 18.8 లక్షల మంది టీకా తీసుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments