కుమార్తె అంత్యక్రియలు వీడియో కాల్‌లో చూసిన తండ్రి.. చివరిసారి?

శనివారం, 4 ఏప్రియల్ 2020 (17:35 IST)
కూతురు మరణించిన వార్తనే తండ్రి జీర్ణించుకోలేకపోతాడు. అలాంటి కుమార్తె మరణించిందని తెలిసి.. ఆ ప్రాంతానికి రాలేక.. అంత్యక్రియలు చూడలేకపోతే.. ఆ తండ్రి పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే తరహా బాధనే ఓ తండ్రి అనుభవించాడు. రోజూ వీడియో కాల్‌తో తనను పలకరించే తన కూతుర్ని చివరి సారి అదే వీడియో కాల్‌లో శ్మశానానికి పంపాల్సి వచ్చింది. 
 
మాటల్లో వర్ణించలేని అలాంటి బాధను ఇప్పుడు జగిత్యాలకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి అనుభవించాడు. తన కుమార్తె చివరి చూపును సైతం చూడలేకపోయాడు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం ఐదు నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు. అతడి కుమార్తె గత కొన్ని రోజులుగా డయాబెటిస్‌తో బాధపడుతోంది. 
 
ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కరోనా నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ ప్రకటించగా.. దుబాయ్‌లోనే ఇరుక్కుపోయిన భాస్కర్.. తన కుమార్తె అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో చేసేదేంలేక తన గారాలపట్టి అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసి.. కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం కంట తడి పెట్టుకున్నారు. 

అన్నీ చూడండి

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments