Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 703 మంది కరోనా బాధితులు మృతి - కొత్తగా 3.47 లక్షల కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 21 జనవరి 2022 (10:02 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 703 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశ వ్యాప్తంగా కొత్తగా 3.47 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం వెల్లడైన కేసులతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 29,722 అధికం. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 మందికి ఈ వైరస్ సంక్రమించింది. అలాగే, 2,51,777 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 20,18,825గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. అదేవిధంగా దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 9692కు చేరుకున్నాయి. నిన్నటితో పోల్చితో ఈ కేసుల సంఖ్య 4.36 శాతం అధికం. 

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments