Webdunia - Bharat's app for daily news and videos

Install App

దడపుట్టిస్తున్న ఒమిక్రాన్ - కొత్త మార్గదర్శకాలు జారీ

Written By ఠాగూర్
Updated: గురువారం, 23 డిశెంబరు 2021 (17:34 IST)
దేశంలో కరోనా వైరస్ దడపుట్టిస్తుంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క రోజే తమిళనాడులో ఏకంగా 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అలాగే, దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడి కోసం కేంద్రం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. 
 
ఈ వైరస్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను కోవిడ్ క్లస్టర్లగా ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పర్యవేక్షించాలని, కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, పండగల సీజన్‌లో ఆంక్షలు, పరిమితులు విధించాలని, ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి టీకాలు వేయాలని సూచన చేసింది. 

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments