Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా.. ఆ ఎనిమిది మంది పోలీసులకు మళ్లీ కోవిడ్...

Written By సెల్వి
Updated: సోమవారం, 7 డిశెంబరు 2020 (20:40 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న క్రమంలో​ హైదరాబాద్‌లో సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. ఇక తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందా.. అనే సందేహాలు తలెత్తున్నాయి. అయితే వారి సందేహం నిజమేనని ఆందోళన వ్యక్తం అవుతోంది. 
 
ఇవాళ ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో నలుగురు సెక్టార్ ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే, ఈ ఎనిమిది మందికి కోవిడ్ సోకడం ఇది రెండో సారి కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
గత జూన్ నెలలో తొలిసారి కరోనా బారినపడ్డ ఈ పోలీసులు.. మరలా ఇప్పుడు మరోసారి ఆ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఎస్‌ఆర్‌‌నగర్‌ పోలీసులు భయాందోళనలు నెలకొన్నాయి. చలి కాలంలో కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. 
 
మరోవైపు, రెండోసారి కోవిడ్ సోకిన కేసులు కూడా హైదరాబాద్‌‌లో వెలుగు చూశాయి. ఎస్‌ఆర్‌నగర్‌‌లో ఏకంగా ఎనిమిది మందికి రెండోసారి కోవిడ్ సోకడం కలకలం సృష్టిస్తోంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments