మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌తో జాగ్రత్త: తెలంగాణ సర్కారు వార్నింగ్

శుక్రవారం, 18 జూన్ 2021 (10:59 IST)
మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్ వల్ల థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర కోవిడ్19 టాస్క్‌ఫోర్స్ , వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు నివేదిక సమర్పించారు. డెల్టా ప్లస్ వేరియెంట్‌తో థర్డ్ వేవ్ వస్తే రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని తెలిపారు. 
 
ఐతే ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే సెకండ్ వేవ్ ముగియక ముందే విజృంభించవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీ చేశారు. 
 
ఫస్ట్ వేవ్ నుంచి పాఠాలు నేర్చుకొని సెకండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని.. కానీ ప్రజలు బాధ్యతగా ఉండకపోతే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే మహారాష్ట్ర డెల్టా హెచ్చరికలతో తెలంగాణ సర్కారు కూడా అప్రమత్తం అయ్యింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలిపింది. 

అన్నీ చూడండి

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments