తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 2వేలకు పైగా..?

బుధవారం, 7 అక్టోబరు 2020 (10:40 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 2,154 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1189 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా కోలుకున్న వారు 2239 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారు 1,77,008 ఉన్నారు. 
 
ఇక మొత్తం యక్టివ్‌ కేసులు 26,551 ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 21,864 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 86.45 శాతం ఉండగా, దేశంలో 84.9 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీ 303, ఖమ్మం 121, మేడ్చల్‌ మల్కాజిగిరి 187, నల్గొండ 124, రంగారెడ్డి 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments