తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 2వేలకు పైగా..?

బుధవారం, 7 అక్టోబరు 2020 (10:40 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 2,154 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,04,748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1189 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా కోలుకున్న వారు 2239 ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారు 1,77,008 ఉన్నారు. 
 
ఇక మొత్తం యక్టివ్‌ కేసులు 26,551 ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 21,864 మంది చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 86.45 శాతం ఉండగా, దేశంలో 84.9 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీ 303, ఖమ్మం 121, మేడ్చల్‌ మల్కాజిగిరి 187, నల్గొండ 124, రంగారెడ్డి 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments