శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (20:08 IST)

రాహుల్ గాంధీని కలిసిన సీనియర్ నేతకు కరోనా.. టెస్టులు చేయించుకున్నారా?

పంజాబ్‌లోని సంగ్రూర్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేతీ బచావో ర్యాలీలో కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ సహా, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సైతం పాల్గొన్నారు.

అయితే రాహుల్ గాంధీని కలిసిన సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌ సింగ్‌ సిద్ధూ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు పంజాబ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
 
కరోనా వైరస్ సోకిన సిద్ధూ దీనిపై స్పందిస్తూ.. ''ఉదయం నుంచి నాకు ఆరోగ్యం చురుగ్గా లేదు. అందుకే నేను పరీక్షలు చేయించుకున్నాను'' అని తెలిపారు. పాజిటివ్‌ రావడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్ధూకు జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు ఉన్నాయని చెప్పారు. ఆయనతో కలిసి తిరిగిన వారిని కూడా పరీక్షించనున్నట్లు అధికారులు చెప్పారు.