Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 81763 టెస్టులు చేస్తే 2567 కొత్త కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 13 జులై 2021 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 81,763 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఈ కేసులు వెల్లడయ్యాయి. 
 
ఈ కేసులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 356 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 351 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, పశ్చిమ గోదావరి జిల్లాలో 279 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 3,034 మంది కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,26,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా  18,87,236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,042కి పెరిగింది.

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments