Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయహో భారత్ : న్యూజిలాండ్‌ చిత్తు.. పదేళ్ళ తర్వాత వన్డే సిరీస్

Updated: సోమవారం, 28 జనవరి 2019 (15:03 IST)
విదేశీ గడ్డపై భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించి కంగారులను కంగారెత్తించిన కోహ్లీ సేన.. ఇపుడు న్యూజిలాండ్‌లోనూ ఇదే జోరును కొనసాగిస్తోంది. ఫలితంగా పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై భారత జట్టు వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో పదేళ్ళ తర్వాత కివీస్ గడ్డపై మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. 
 
కాగా, సోమవారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. 
 
భారత జట్టు ఓపెనర్లలో రోహిత్ శర్మ 62, శిఖర్ ధావన్ 28, విరాట్ కోహ్లీ 60, అంబటి రాయుడు 40, దినేష్ కార్తీక్ 38 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, కుమార్ 2, చాహల్ 2, పాండ్యా 2 చొప్పున వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. 

అన్నీ చూడండి

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి చికిత్స.. ఎక్కడ?

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

ఐరోపాలో తీవ్రమైన వేడిగాలులు... ఫ్రాన్స్‌లో కార్చిచ్చులు.. రవాణా వ్యవస్థలకు అంతరాయం

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయండి.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

కుక్కకాటు నుంచి తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్‌? (video)

Varanasi Story Updage: అంటార్కిటికాలో గడ్డకట్టిన మంచులో వారణాసి నుంచి మహేష్ బాబు

Niharika: శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల

Kangana: కంగనా రనౌత్ నటించిన 26/11 దాడుల కథతో భారత్ భాగ్య విధాత రెడీ

తర్వాతి కథనం
Show comments