ఐపీఎల్ కోసం టీమిండియా డ్రామా : నోరు పారేసుకున్న మైఖేల్ వాన్

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (17:50 IST)
ఐపీఎల్ టోర్నీ కోసం భారత్ క్రికెట్ జట్టు సరికొత్త డ్రామాకు తెరతీసిందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆరోపించారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ వాయిదాపడింది. దీనిపై మైఖేల్ వాన్ స్పందిస్తూ, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరపున ఆడే టెస్ట్‌ మ్యాచ్‌ కంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లంటేనే ముఖ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కోవిడ్‌ టెస్ట్ ‘నెగెటివ్‌’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లీ అండ్‌ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్‌ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్‌ టెస్ట్‌ రద్దయిందని మైఖేల్ వాన్ ఆరోపించారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల మార్కు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments