ఐపీఎల్ కోసం టీమిండియా డ్రామా : నోరు పారేసుకున్న మైఖేల్ వాన్

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (17:50 IST)
ఐపీఎల్ టోర్నీ కోసం భారత్ క్రికెట్ జట్టు సరికొత్త డ్రామాకు తెరతీసిందంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆరోపించారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ వాయిదాపడింది. దీనిపై మైఖేల్ వాన్ స్పందిస్తూ, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరపున ఆడే టెస్ట్‌ మ్యాచ్‌ కంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లంటేనే ముఖ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కోవిడ్‌ టెస్ట్ ‘నెగెటివ్‌’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన కోహ్లీ అండ్‌ కో అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్ట్‌ ఆడితే ఏమయ్యేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని ఘాటుగా విమర్శించారు. టీమిండియా ఆటగాళ్లలో కరోనా సోకుతుందేమోనన్న భయం కంటే ఐపీఎల్‌కు దూరమవుతామనే ఆందోళన ఎక్కువైందని, అందువల్లే మాంచెస్టర్‌ టెస్ట్‌ రద్దయిందని మైఖేల్ వాన్ ఆరోపించారు. 

అన్నీ చూడండి

జూలై 15, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments