నా మాటకు విలువ లేదు.. ఈ కెప్టెన్సీ నాకొద్దు : మహ్మద్ నబీ

శనివారం, 5 నవంబరు 2022 (08:45 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా సూపర్ -12 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ టోర్నీలో పాలుపంచుకుంటున్న జట్లలో ఆప్ఘనిస్థాన్ కూడా ఉంది. అయితే, ఈ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. శుక్రవారం బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. అంటే ఆ జట్టు ఆడిన మొత్తం 5 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. 
 
మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. గ్రూపు దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడు స్థానంలో నిలిచింది. ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "గత యేడాది కాలంగా మా జట్టు సన్నాహాలు ఓ పెద్ద టోర్నీకి అవసరమైన స్థాయిలో లేవు. ఓ కెప్టెన్‌గా నా మాటకు విలువ లేకుండా పోయింది. ఇటీవల కొన్ని పర్యటనల్లో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ, నాకు మధ్య సమన్వయం కొరవడింది. దాంతో జట్టులో సమతూకం కొరవడింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా తక్షణం వైదొలుగుతున్నాను. 
 
జట్టు మేనేజ్‌మెంట్, జట్టు ఎపుడూ నా సేవలు కోరుకున్నా అందించడానికి సర్వదా సిద్ధం. ఈ ప్రపంచ కప్‌‍లో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మా కోసం మైదానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలు మాకెంతో విలువైనవి" అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments