శుక్రవారం, 7 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (17:08 IST)

దుబాయ్ వికెట్ గమ్మత్తుగా ఉంది.. అక్కడే రిథమ్ కోల్పోయి ఓడిపోయాం : స్మిత్

steve smith
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 264 పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించారు. దుబాయ్ వికెట్ కాస్త గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోరు ఈ వికెట్‌పై సాధించలేకపోతున్నారు. మేం కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మ్యాక్స్‌వెల్ కూడా వికెట్‌ను సమర్పించాడు. అక్కడే మేము రిథమ్ కోల్పోయాం. 
 
ఈ మ్యాచ్‌లో 280కి పైగా పరుగులు చేసివుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పివుంటే ఉండివుంటే లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అపుడు ప్రత్యర్థిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణంచారు. ముఖ్యంగా, మా బౌలింగ్‌ ఎటాక్‌లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికీ టోర్నీ అసాంతం వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారీ విజయలక్ష్యాన్ని ఛేదించాం. మా జట్టులోని కొంతమంది కుర్రోళ్లు భవిష్యత్‌లో ఖచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లుగా ఎదుగుతారు అని స్మిత్ గట్టి నమ్మకం వ్యక్తం చేశారు.