Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుస ఓటములతో డీలాపడిన ముంబై ఇండియన్స్‌కు శుభవార్త... ఏంటది?

Written By ఠాగూర్
Updated: గురువారం, 4 ఏప్రియల్ 2024 (16:34 IST)
ఐపీఎల్ 2024 ఫ్రాంచేజీలలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకటి. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. అలాంటి జట్టుకు ఓ శుభవార్త. స్టార్ ఆటగాడు సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు. గురువారం ఎన్.సి.ఏ రొటీన్ టెస్ట్ చేయనుంది. రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్‌ కోసం ఈ టెస్ట్ తప్పనిసరి. ఆ తర్వాత ఎన్.సి.ఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఆయన ముంబై జట్టులో చేరుతారు. 
 
కాగా, ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఇలా వరుస ఓటములతో డీలాపడిన ఎంఐకి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆ జట్టు కీలక ఆటగాడు, వరల్డ్ నం.01 టీ20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న సూర్య కుమార్.. అక్కడ అన్ని ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. 
 
ఒక రొటీన్ టెస్టు మాత్రమే మిగిలివుందట. అది గురువారం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడమే ఆలస్యం సూర్యకుమార్ ముంబై జట్టుతో చేరుతాడు. ఎంఐ తన తర్వాతి మ్యాచ్‌లను 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, 11వ తేదీన ఆర్సీబీతో ఆడనుంది. డీసీతో మ్యాచులో అతడు బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
 
ఇక సూర్య చేరిక ముంబైకి కలిసి రానుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఎంఐకి సూర్యభాయ్ బూస్ట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, సూర్యకుమార్ గతే యేడాది డిసెంబరు నెలలో దక్షిణాఫ్రికాపై చివరి సారిగా క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఎన్సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకుంటున్నాడు.
 
"సూర్య అన్ని టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఒక రోటిన్ టెస్ట్ మిగిలింది. అయితే, ఎన్సీఏ నుంచి ఆర్టీపీ (రిటర్న్ టు ప్లే) సర్టిఫికేట్కు ఈ టెస్టు తప్పనిసరి. ఇది గురువారం నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత అతని పూర్తి ఫిటెనెస్పై ఒక అంచనా వస్తుంది. ఇప్పటికైతే అతడు సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు" అని పీటీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

ఆగస్టు 19, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

దారుణం, మహిళను కత్తితో పొడిచి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే వంట చేస్తూ వున్నాడు

18 ఏళ్ల విద్యార్థికి దొరికిన బంగారు నాణేలు, బిస్కెట్లు.. వాటి విలువ రూ.98 కోట్లు

ఫ్లెక్సీలు, బ్యానర్లతో తిరుపతి రోడ్లు రోత రోత.. శ్రీవారి భక్తుల ఆవేదన

పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments