ప్రియుడినే నమ్మింది, సర్వస్వం అర్పించిన తరువాత?

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:26 IST)
మూడేళ్లు గాఢంగా ప్రేమించింది. ప్రియుడికి సర్వస్వం సమర్పించింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉంటానని అనుకుంది. ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే ప్రియుడే మోసం చేస్తాడని ఊహించలేదు. అర్ధాంతరంగా తనువు చాలించింది.
 
పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రసన్న, సందీప్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సందీప్‌తో ఎంతో సఖ్యతగా ఉండేది ప్రసన్న. తన జీవితంలో ఇక మిగిలింది సందీప్ మాత్రమేనని భావించిన ప్రసన్న అతనికి సర్వస్వం అర్పించింది.
 
త్వరలోనే వివాహం జరుగుతుందని, జీవితమంతా హాయిగా ఉండవచ్చని భావించింది. కానీ ప్రియుడు మోసం చేసి మరదలితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే సందీప్ తనను మోసం చేయడాన్ని అసలు జీర్ణించుకోలేక పోయింది. సందీప్ లేని జీవితం వద్దనుకొని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments