హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైల్ : డీపీఆర్‌కు ఆహ్వానం

గురువారం, 29 అక్టోబరు 2020 (09:25 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై - భాగ్యనగరం హైదరాబాద్‌ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం 711 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో బుల్లెట్ రైల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్) కోసం బిడ్లను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా, నవంబరు 5వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. 
 
ఈ సమావేశంలో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సమగ్ర సర్వే, ఉపరితల మార్గం, భూగర్భ మార్గం, సబ్‌స్టేషన్లు తదితర మార్గాలపై చర్చించనున్నారు. తద్వారా ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొదించనున్నట్టు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి సుష్మా గౌర్ వివరాలను వెల్లడించారు. ఈ కారిడార్‌కు సంబంధించి నవంబరు 18వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. విజయవంతమైన బిడ్డరుకు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 
 
ఇటీవలే మరో ఏడు కారిడార్లలోనూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డీపీఆర్‌లను ఆహ్వానించింది. ఇందులో ఢిల్లీ టు అమృతసర్, అమృతసర్ టు చంఢీఘర్, ఢిల్లీ టు వారణాసి, ముంబై టు నాగ్‌పూర్, ఢిల్లీ టు అహ్మదాబాద్ కారిడార్లు ఉన్నాయి. వీటితో పాటే ముంబై టు పూణె, పూణె టు హైదరాబాద్ కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. చెన్నై టు మైసూర్, వారణాసి టు హౌరా మార్గాలకు ఇంకా టెండర్లు పిలవాల్సివుంది. 
 
ఈ బుల్లెట్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం, దూరం మరింత తగ్గుతుంది. తద్వారా వ్యాపార, వాణిజ్య రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. 2028 నాటికి దేశంలో బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. తద్వారా రైల్వే రూపు రేఖలు మారిపోతాయని విశ్వసిస్తోంది. 
 
ప్రస్తుతం అహ్మదాబాద్ - ముంబై బుల్లెట్ రైల్ కారిడార్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోనుంది. 

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments